Nayanthara: ప్రముఖ సినీ నిర్మాత కె.ఎస్. రామారావుగారు తీసిన సినిమాల్లో ‘మాతృదేవోభవ’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనం సృష్టించింది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ఈ సినిమా ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది.

ఇప్పటికీ టీవీల్లో సినిమాను చూసి అదే భావోద్వేగానికి లోనవుతుంటారు ఆడియన్స్. నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమాను మళ్ళీ రీమేక్ చేయాలని అనుకుంటున్నారట కె.ఎస్.రామారావుగారు. ఈ రీమేక్లో నయనతారను కథానాయకిగా తీసుకోవాలనేది ఆయన ఆలోచనట. ఆయన ఆలోచన సరైనదే.
ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల స్టార్ డమ్, ఎంత బరువైన పాత్రనైనా మోయగల స్టేచర్ ఉన్న హీరోయిన్ నయనతార. ఆమె నటించడం సినిమాకు తప్పకుండా కలిసొచ్చే విషయమే. అయితే ఆమె రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా ఉంది. అరకొర నిడివి ఉండే పాత్రలకే కోట్లలో తీసుకుంటుంది ఆమె. అలాంటిది ఫుల్ లెంగ్త్ రోల్ అంటే కనీసం మూడు నుండి 4 కోట్లు డిమాండ్ చేయవచ్చు. అది నిర్మాతలకు పెను భారం లాంటిది. దాన్ని మోయడం నిర్మాత వల్ల కాకపోవచ్చు.
