నయనతార డబ్బు కోసమే తన పెళ్ళి వీడియోని అమ్ముకుంది… తమిళ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె తాజాగా తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక వీరు పెళ్లి కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 25 కోట్లు ఖర్చు చేసి వివాహాన్ని జరిపించిందనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదే విధంగా వీరి పెళ్లి వేడుకను భారీ ధరలకు నెట్ఫ్లిక్స్ కి అమ్ముకోవడం పై ప్రముఖ తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సెలబ్రిటీలు సైతం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇక వారు ఏదైనా వెకేషన్ కి వెళ్లాలంటే వారు ప్రత్యేకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తూ ఎంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఇక తాజాగా నయనతార తన పెళ్లి వేడుకను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ అమ్ముకున్నారు. అయితే తన దగ్గర నుంచి 50 కోట్లకు తెచ్చుకొని దానిని ప్రసారం చేస్తూ 500 కోట్ల రూపాయలను సంపాదిస్తారు.

ఇదే ధోరణిలో ప్రతి ఒక సెలబ్రిటీ కూడా వెళ్తారు.ఇలా తమ విలాసాలని చూపించడానికి ప్రతి ఒక్కరూ అధిక మొత్తంలో ఖర్చు చేయడం వాటిని కోట్లకు అమ్ముకోవడం ఆ డబ్బును ప్రజల నుంచి పొందడం చేస్తున్నారు. ఇలాంటి వారందరూ కూడా అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఎంజీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎంజీఆర్ గారు ఏ విధమైనటువంటి సాదాసీదా జీవితం గడిపే వారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దర్శకుడు వేలు ప్రభాకరన్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు.