ప్రతి కామన్ మ్యాన్ కు ఈ అవార్డ్ అంకితం – సైమా బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) విన్నర్ నవీన్ పోలిశెట్టి

సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరోనవీన్ పోలిశెట్టి. ఆయన నటించిన జాతిరత్నాలు సినిమా కోవిడ్ టైమ్ లోనూ ఘన
విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ ఇయర్బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా నవీన్ కు సైమా బెస్ట్యాక్టర్ (క్రిటిక్స్) అవార్డునూ సంపాదించి పెట్టింది. తాజాగా జరిగిన సైమాఅవార్డ్స్ లో జాతి రత్నాలు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పురస్కారంగెల్చుకున్నారు నవీన్ పోలిశెట్టి

ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ…నేను సినిమా హీరో అవుతాననిచెబితే..అలాంటి కలలు కనకు అని అనేవారు. ఇవాళ నా కల నిజమైంది. సైమాలోబెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డ్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతినిఇస్తోంది. నేను అభిమానించే హీరోలు అల్లు అర్జున్, రన్వీర్ సింగ్ సమక్షంలోఅవార్డ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పురస్కారం ఇచ్చిన స్ఫూర్తితోమరింత కష్టపడి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాను. ప్రతి సాధారణ యువకుడికిఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నా. మీరూ కష్టపడి, ప్రయత్నిస్తే నాలాగేఅనుకున్నది సాధించగలరు అని అన్నారు.

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ చిత్రంలోనటిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాచిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న నవీన్ అనుష్కసినిమాపై మంచి అంచనాలున్నాయి.