Nara Lokesh: కల్తీ సారా మరణాలపై స్పందించిన నారా లోకేష్!

Nara Lokesh: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కల్తీ సారా మరణాల గురించి పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యాడు. పైగా టీడీపీ నేతలతో కలిసి నిరసనలో కూడా పాల్గొన్నాడు. దాంతో తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు ఫోటోలు కూడా పంచుకున్నాడు.

పైగా కొన్ని విషయాలు పంచుకున్నాడు. కల్తీ సారా తో పాటు జే బ్రాండ్ లిక్కర్ వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నాడు. 28 ప్రాణాలు బలిగొన్న ఈ కల్తీ సారా, లిక్కర్ లపై అసెంబ్లీ లో చర్చ జరగాలని కోరుతూ నిరసన తెలిపామని అన్నాడు. అసెంబ్లీలో తమ పోరాటం వలనే యంత్రాంగం ఆగమేఘాలపై సారా స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది అని అన్నాడు.