Nara Lokesh: తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ గట్టిగానే సవాల్ విసిరారు మంత్రి లోకేష్. ఒకవేళ జగన్ చేసిన ఆరోపణలు తప్పు అని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలి అని లోకేష్ తెలిపారు.
మొదట ఆరోపణలు చేయడం తర్వాత పారిపోవడం జగన్ కు కొత్త ఏమీ కాదని అన్నారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ జగన్ నారా లోకేష్పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఏపీ మంత్రి లోకేష్ ఛాలెంజ్ కు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నాను. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాము.
మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. అలాగే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాము. పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రాబడుతున్నాము. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది అంటూ మంత్రి లోకేష్ సెటైర్స్ వేశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ పట్ల జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మరి జగన్ తాను చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తారా లేదా చూడాలి మరి.