జగన్మోహన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందన్న నారా లోకేష్..

తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఇటీవలే తేదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అక్రమంగా కట్టారు అని అంతేకాకుండా ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు కూడా ఆక్రమించుకున్నారు అని కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది దౌర్జన్యం అంటూ నారా లోకేష్ అన్నారు.

ఇక నోటీసుల పేరుతో పోలీసులు మాత్రం హైడ్రామా చేశారు అని.. ఆయనపై కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది అంటూ.. మూడేళ్ల తర్వాత కూడా విపక్ష నేతల ఇళ్లు కూర్చుతున్నారని, అరెస్టులనే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని విమర్శించారు.