మరోసారి క్రేజీ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన నాని.. ఈసారి కూడా హిట్టే?

అష్టా చెమ్మా సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంటరైన నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నాని నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. కెరీర్ బిగినింగ్ నుండి నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవల నాని నటించిన శ్యామ్ సింగరాయ్, అంటె సుందరానికి వంటి సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన అంటె సుందరానికి సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని కి జోడీగా మలయాళీ భామ నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ప్రస్తుతం నాని “అంటే సుందరానికి” సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా” సినిమాలో నాని నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి “మిడిల్ క్లాస్ అబ్బాయి” అనే సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా దసరా సినిమా ద్వారా వీరిద్దరూ మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. నాని నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.

అయితే దసరా సినిమా తర్వాత నాని ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడన్న విషయం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నాని కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా
నిలిచిన భలే భలే మగాడివోయ్ సినిమా దర్శకుడు మారుతి దర్శకత్వంలో నాని తన తదుపరి సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మారుతి.. గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా ప్రభాస్ తో కూడా మారుతి ఒక సినిమా చేయవలసి ఉంది. కాకపోతే ఈ సినిమా ఇంకా లేట్ అవ్వటంతో మారుతి నాని కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి మరి.