Naga Chaitanya: విడాకులపై మరొకసారి స్పందించిన నాగచైతన్య?

Naga Chaitanya: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడి పోతున్నాము అని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే విడిపోతున్నట్లు ప్రకటించిన దాదాపుగా రెండు నెలలు కావస్తున్నా ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా విడిపోవడానికి గల కారణం ఏమిటి అన్నది ఇంతవరకూ తెలియనే లేదు. ఈ విషయంపై ఇటు సమంతా కానీ, అటు నాగచైతన్య కానీ స్పందించలేదు.

కానీ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత వారి వారి కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా విడాకులు తీసుకుంటున్న సమయంలో మంచి స్నేహితులుగా ఉంటాము అని ప్రకటించిన వీరు స్నేహితులుగా కూడా ఉండటం లేదు. ఇదిలా ఉంటే ఇటీవలే నాగ చైతన్య వారి విడాకుల విషయంపై స్పందిస్తూ.. సమంత హ్యాపీగా ఉంది..నేను కూడా హ్యాపీ గా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నాగచైతన్య. ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ విడాకుల స్పందించాడు. నా గురించి ఎవరు ఏమి చేసినా నాకు పర్వాలేదు.. కానీ నా కుటుంబం గురించి రాస్తే నేను బాధ పడతాను అని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మిస్ లీడ్ చేయనంతవరకు నేను కూడా స్పందించను అని తెలిపాడు నాగచైతన్య. అలాగే తండ్రి నాగార్జున చెప్పిన విధంగా కుటుంబ సంబంధమైన, వ్యక్తిగతమైన వాటిని సరిదిద్దుకోవాలి తప్ప, ఒకవేళ సరిదిద్దుకో లేకపోతే పర్వాలేదు రియాక్ట్ అవ్వకండి అని తెలిపారు అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. అలాగే నేను పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న విషయాన్ని బలంగా నమ్ముతాను.. అందువల్లే నా గురించి జరిగే ప్రచారాలు గురించి నేను పెద్దగా స్పందించను.. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం.. నన్ను ఎంతో బాధించింది అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.