బుచ్చిబాబు రెండో సినిమా ఫిక్స్..ఈ సారి ఏ జోన‌ర్‌లో చేస్తున్నాడో తెలుసా?

లెక్క‌ల మాస్టార్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బుచ్చిబాబు తెర‌కెక్కించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామి సృష్టిస్తుంది. నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు పైగా.. వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఉప్పెన. ఈ దూకుడు చూస్తుంటే ఉప్పెన కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో రావ‌డం ఖాయంగా తెలుస్తుంది.ఉప్పెన చిత్రాన్ని ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కించిన బుచ్చిబాబు ఇప్పుడు త‌న రెండో సినిమాను కూడా ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలోనే చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

ఉప్పెన చిత్రం త‌ర్వాత బుచ్చిబాబుపై న‌మ్మ‌కం ఉంచిన మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు త‌ర్వాతి సినిమాని కూడా త‌మ బేన‌ర్‌లోనే చేసేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు చేయ‌బోయే రెండో సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని టాక్. 1980 ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తుండ‌గా, ఇందులో స్టార్ హీరో న‌టించ‌నున్నాడ‌ని, క‌థానాయిక‌గా టాప్ యాక్ట్రెస్ ఉంటుంద‌ని స‌మాచారం. స్టార్ హీరోతో సినిమా చేస్తే బుచ్చిబాబు ద‌శ తిర‌గ‌డం ఖాయం.

ఇక ఉప్పెన సినిమాతో మాంచి ఫాంలోకి వ‌చ్చిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ‌బుచ్చిబాబుకు ఖ‌రీదైన‌ కారు, ఇల్లు, రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొమ్మ‌నే ఆఫర్ ఇచ్చింద‌ట‌. ఉప్పెన చిత్రం మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు సినిమా హిట్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో ఛ‌లో సినిమా తీసినందుకు వెంకీ కుడుముల‌, ప్ర‌తి రోజు పండ‌గే చిత్రం తెర‌కెక్కించినందుకు మారుతి కార్లు బ‌హుమ‌తిగా పొందిన విష‌యం తెలిసిందే.