ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో భూమిక తిట్టినా బండ బూతులు విని షాక్ అయ్యా: ఎమ్మెస్ రాజు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎమ్మెస్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ బ్యానర్ లో తెరకెక్కిన దేవి, దేవీ పుత్రుడు ఒక్కడు మనసంతా నువ్వే వర్షం, మస్కా,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఘనత సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కి ఉందని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉన్నటువంటి ఎం.ఎస్.రాజు తాజాగా డర్టీ హరి అనే చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే తన కొడుకు సుమంత్ తో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఎం.ఎస్.రాజు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఎం.ఎస్.రాజు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఒక్కడు సినిమా షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ భూమిక ఫైట్ మాస్టర్ తో భారీ గొడవ పెట్టుకున్నారు. ఇలా అతనితో గొడవ పడుతూ ఈమె ఏకంగా బండబూతులు మాట్లాడారు. భూమిక అలా బండ బూతులు మాట్లాడటం విని ఒక్కసారిగా షాక్ అయ్యానని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే భూమిక ఫైట్ మాస్టర్ తో ఎందుకు గొడవ పడ్డారు, అసలేం జరిగింది, భూమిక బండ బూతులు తిట్టేలా ఫైట్ మాస్టర్ ఏం చేశాడు అనే విషయాల గురించి తెలియాలంటే మనం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.