మిస్టర్ షన్నూ సింపతీ స్ట్రాటజీ మొదలెట్టాడుగా.!

టాస్క్‌లో సరిగా పర్ఫామెన్స్ చేయడం మానేసి, సిరిని అడ్డం పెట్టుకుని ఫ్రెండ్‌షిప్ ముసుగులో బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడు మిస్టర్ షన్నూ. బిగ్‌ హౌస్ బిరుదుల ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్ పెడితే, ఏకగ్రీవంగా ‘మిస్టర్ లేజీ’ బిరుదు దక్కించుకునే ఏకైక హౌస్ మేట్ షణ్ముఖ్ జశ్వంత్ అవుతాడనడం అతిశయోక్తి అనిపించదు.

గుడ్లు దాచిపెట్టుకునే టాస్క్‌లో తాను చాలా కష్టపడిపోయాననీ, కానీ, తన కష్టాన్ని పట్టించుకోకుండా తన ఫ్రెండ్సే తనను మోసం చేశారనీ సిరి, జెస్సీలపై జలస్ ఫీలయ్యాడు మిస్టర్ షన్నూ. టాస్క్‌లో భాగంగా జశ్వంత్‌కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌ సంబంధించి ఒకే ఒక్కరితో సంప్రదించి, వారి సాయం తీసుకుని, తద్వారా ముగ్గురు కంటెస్టెంట్ల వద్ద నుంచి ఎగ్స్ తీసుకుని వారిని జీరో చేయాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో ప్రియాంకా, ప్రియతో పాటు, షన్నూ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకున్నారు సిరి,జశ్వంత్‌లు. ఈ ఇష్యూకి సంబంధించి తనను జీరో చేసి, ఎధవను చేశారనీ ఫ్రెండ్స్‌పై చిర్రెత్తిపోయాడు షన్నూ. ఎంతగా ప్రాధేయపడినా సిరినీ, జశ్వంత్‌నీ క్షమించలేదు షన్నూ. షన్నూ బిహేవియర్ హౌస్‌మేట్స్‌కే కాదు, చూస్తున్న ఆడియన్స్‌కీ చిరాకు తెప్పించింది. అంతా చేసి, మళ్లీ మొసలి కన్నీళ్లు కార్చడం కూడా వీక్షకులకు నచ్చలేదు.

యూ ట్యూబ్‌లో ఎంతో యాక్టివ్‌గా కనిపించే షన్నూ, హౌస్‌లోని లేజీ పర్ఫామెన్స్‌తో అతనికున్న గుడ్ ఇమేజ్‌ని చేతులారా డ్యామేజ్ చేసుకుంటున్నాడన్న ప్రచారం నెట్టింట మార్మోగిపోతోంది. అరే.. ఏంట్రా ఇది.