Mohan Babu: నా మౌనం చేతకానితనం కాదు… కలిసి పని చేద్దాం అంటూ మోహన్ బాబు బహిరంగ లేఖ!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా టికెట్ల విషయంపై రోజు రోజుకు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సినీ కార్మికులకు ప్రతి ఒక్క కష్టంలోనూ అండగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.ఈ క్రమంలోనే దాసరి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదని ఆ బాధ్యతలు చిరంజీవి తీసుకోవాలని పలువురు కోరడంతో అలాంటి పెద్ద బాధ్యత తనకు వద్దని అయితే ఏ ఒక్క కార్మికుడికి ఆపద వచ్చినా తాను ముందు ఉంటానని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇదిలా ఉండగా తాజాగా మోహన్ బాబు కూడా ఒక బహిరంగ లేఖ ద్వారా సినిమా టికెట్ల విషయం పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మౌనంగా ఉన్నానంటే దానికి అర్థం చేతకాని తనం కాదు కొందరు మిత్రులు నీ మాటలు ఎంతో కటువుగా ఉంటాయని చెప్పారు.కటువుగా ఉన్న అన్ని నిజాలే ఉంటాయని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలిపారు. కొందరు మిత్రులు శ్రేయోభిలాషులు ఆవేశం పనికిరాదని చెప్పడంతో సైలెంట్ గా ఉన్నానని అంతమాత్రాన వారికి నచ్చిన విధంగా మనం నడుచుకోవాలి అంటే కుదరదని ఈ లేఖలో పేర్కొన్నారు.

అందరం కలిసి కూర్చొని సినిమా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను సీఎం ముందు ఉంచి పరిష్కారం వెతకాలి అన్నారు.ఇలా అందరూ కలిసి ఉంటేనే సినిమా సమస్యలను పరిష్కరించగలమంటూ మోహన్ బాబు ఈ సందర్భంగా సినిమా టికెట్ల వ్యవహారం పై స్పందిస్తూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.