ఇండియన్ ఐడల్ సింగింగ్ షో నుంచి కోపంగా వెళ్లిపోయిన మెగాస్టార్.. అసలేం జరిగింది?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగిల్ కాంపిటీషన్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ముఖ్యఅతిథిగా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు విరాటపర్వం టీమ్ నుంచి రానా, సాయి పల్లవి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో సరదాగా పాల్గొన్నప్పటికీ ఈ కార్యక్రమం చివరిలో మెగాస్టార్ ఎంతో కోపంగా వేదికపై నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.ఇలా మెగాస్టార్ కోపంగా వెళ్లిపోవడంతో విన్నర్ ఎవరో ప్రకటించకుండానే టైటిల్ ఇచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే మెగాస్టార్ ఇలా కోపంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అనే విషయం మాత్రం తెలియడం లేదు.

మరి ఈ విధంగా చిరంజీవి వేదికపై నుంచి నిజంగానే వెళ్లి పోయారా? అసలేం జరిగింది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరాతీస్తున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోలేదని ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని మెగా అభిమానులు ఈ ఘటనపై స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. అయితే నిజంగానే చిరంజీవి ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారా?అసలేం జరిగింది అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం జూన్ 17వ తేదీ ప్రసారం కానుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే .