అమ్మ బ‌ర్త్‌డే రోజున ఏక‌మైన మెగా ఫ్యామిలీ.. వైర‌ల్‌గా మారిన ఫ్యామిలీ పిక్

ఈ రోజు మెగా ఫ్యామిలీ ఇంట సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. మంచి న‌టుల‌ని అభిమానులకి అందించిన మాతృమూర్తి అంజ‌నీదేవి బ‌ర్త్‌డే ఈ రోజు కాగా, ఆమె బ‌ర్త్‌డేను పురస్క‌రించుకొని మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల నాగ‌బాబు ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. స‌ముద్రం లాంటి జీవితంలో స్థిరంగా నిల‌బ‌డేందుకు యాంక‌ర్‌లా ఉన్న త‌ల్లికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ప్ర‌తి ప్ర‌య‌త్నం వెనుక నా త‌ల్లి ఉంది. పాతాళానికి ప‌డిపోయిన స‌మ‌యంలో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ‌, నీ ఓదార్పు చిన్న మాట‌లే కావొచ్చు, జీవితంలో పెద్ద స‌మ‌స్య‌లు ఎదుర్కొనేంత ధైర్యాన్నిచ్చాయి. ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న త‌ల్లి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక వీడియో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ‘డాడీ’లోని గుమ్మాడి గుమ్మాడి పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచి చెల్లెళ్ళు, త‌మ్ముళ్ళ‌తో అమ్మ క‌లిసి దిగిన ఫొటోల‌ని జ‌త చేసి వీడియో రూపంలో షేర్ చేశాడు. . ‘జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు!’ అంటూ క్యాప్ష‌న్ రాశారు. చిరు షేర్ చేసిన వీడియో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక త‌న త‌ల్లి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆచార్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. అంతేకాదు మే 13న ఆచార్య మూవీ థియేట‌ర్స్‌లోకి రానుందంటు మ‌రో గుడ్ న్యూస్ చెప్పి మెగా ఫ్యాన్స్ జోష్ పెంచాడు. ఇదిలా ఉంటే అంజ‌నామూర్తి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె క‌డుపున జ‌న్మించిన పిల్ల‌లంద‌రు ఓ చేటి చేరి సంద‌డి చేశారు. అంజ‌నా దేవితో నాగబాబు, పవన్ కళ్యాణ్, విజయ దుర్గ, మాధవిలత‌, చిరంజీవి క‌లిసి దిగిన ఫొటో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది .