Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినపడుతున్న పేరు. ఈమె గత కొద్దిరోజులుగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. గుంటూరు కారం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం విజయ్ దళపతి గోట్, లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస హిట్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి గురించి ఒక వార్త వైరల్ అయింది ఈమెను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారంటూ వార్తలు వినిపించాయి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో అదే రోజున మీనాక్షి చౌదరిని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతున్నారని వార్తలు వచ్చాయి..
ఇలా ఏపీ ప్రభుత్వం ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా మరికొంతమంది విమర్శలు కూడా చేశారు. నిజానికి మీనాక్షి చౌదరి హర్యానాకు చెందిన అమ్మాయి ఇలా ఆంధ్ర పదేశ్ కు చెందిన వ్యక్తిని కాకుండా పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఇలాంటి పదవి ఇవ్వటం ఏంటి అంటూ చాలా మంది విమర్శలు కురిపించారు. ఈమె కంటే కూడా ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు. అలాంటి వారిని మహిళా సాధికారిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించవచ్చు కదా అంటూ విమర్శలు కురిపించారు.
ఇలా మీనాక్షి చౌదరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయంపై స్పందించారు. మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వ మహిళా సాధికారత విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు. ఇక ఈ వార్తలన్నీ ఫేక్ అని తెలియడంతో ఒక ఫేక్ న్యూస్ తో మీనాక్షి చౌదరికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.