Crime: రెండు రోజుల పరిచయం.. మూడవ రోజు ఏకంగా అత్యాచారం.. ఎక్కడో తెలుసా.?

Crime: తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సులేమాన్ నగర్ కు చెందిన సాజిత్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థ లో పని చేస్తున్నాడు. ఇక సాజిత్ కు రెండు రోజుల క్రితం ఇంస్టాగ్రామ్ లో సంతోష్ నగర్ కు చెందిన 20 ఏళ్ల యువతి పరిచయమైంది. అలా వారిద్దరూ ఫోన్ నెంబర్ లు మార్చుకొని వాట్సాప్ లో చాటింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు మూడవ రోజు ఒకసారి కలుద్దాం అని సాజిత్ ఆ యువతిని కోరగా అందుకు ఆమె కూడా సరే అంది. అతడిని నమ్మిన ఆ యువతి సరేనని చెప్పి రాజేంద్ర నగర్ కు వచ్చింది.

అప్పుడు సాజిత్ ఆమెను బైక్ ఫై ఎక్కించుకుని సులేమాన్ నగర్ లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనితో సదరు యువతి 100 కు కాల్ చేసి చెప్పగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.