Crime News: భార్య లేటుగా తలుపు తీసిందని భర్త చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Crime News: సహజంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఇద్దరు కూర్చొని సమస్యను పరిష్కరించకుండా తరచూ గొడవ పడటం వల్ల ఒక్కోసారి అనర్ధాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో అందరికీ స్వతంత్ర భావాలు ఎక్కువ అవ్వడం వల్ల భార్య భర్తలు ఇద్దరు పోటాపోటీగా సర్దుకు పోయే స్వభావం లేకుండా తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఇలా గొడవలు పడటం వల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్య భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం గా ఉంటే వారి సంసారం బాగుంటుంది. అలాకాకుండా అనుమానంతో ఉండటం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద గొడవ జరుగుతుంది.

సాధారణంగా భార్యాభర్తల అనుమానాల వల్ల కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు ఒక్కోసారి పంచాయతీ వరకు వెళుతూ ఉంటే మరీ కొన్ని మాత్రం ప్రాణాలు తీసే స్థాయికి వెళుతున్నాయి. ఇటీవల భర్త అనుమానం వల్ల ఒక భార్య రోడ్డున పడింది. వివలరాలోకి వెళితే..గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలోని షాపూర్ ప్రాంతంలో దంపతులు ఏడాది వయసున్న కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరు ప్రతి నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. బాధితురాలి భర్త పని నిమిత్తం బయటకు వెళుతూ అప్పుడప్పుడు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఎప్పటిలాగే ఆరోజు బట్ట ఇంటికి రావడం ఆలస్యం కావడంతో భార్య బెడ్ రూం లో తలుపు వేసుకుని నిద్ర పోయింది.

బాధితురాలి భర్త ఆలస్యంగా ఇంటికి వచ్చి ఎంత సేపు బెడ్రూం తలుపు తట్టినా భార్య తలుపు తీయలేదు. సాధారణంగా అతడు అనుమాన స్వభావం కలిగిన వ్యక్తి. భార్య ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో గట్టి గట్టిగా తలుపులు బాదాడు. ఆ శబ్దానికి భార్యకి మెలుకువ వచ్చి తలుపు తీయగా.. తలుపు తీయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? గదిలో లో ఎవరున్నారు అంటూ ఆమె మీద అనుమాన పడి భార్యను ఇంటి నుండి బయటకి గెంటేసాడు. బాధితురాలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి వరకట్నం కోసం ఏదో విధంగా తనను వేధిస్తూ ఉంటాడని భర్తపై కేసు నమోదు చేయించింది. నాకు మీరే న్యాయం చేయాలి అంటూ పోలీసులను అర్థించింది.