హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయిన మహేష్..!

బాహుబలి, క్షణం వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు హీరోగా తెరకెక్కిన సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి మహేశ్ బాబు నిర్మించాడు. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ కథని నిర్మించటానికి మహేశ్ బాబు ముందుకు రావటంతో ఈ సినిమా పట్టలెక్కింది. ఈ సినిమాలో మహేశ్ బాబు భాగం కావటంతో ఆయన అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా చరిత్రలోనే ఏ సినిమా చేయని విధంగా రిలీజ్ కి ముందె వైజాగ్ లో ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్రేక్షకుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఇంత గొప్ప సినిమా తీయటం లో నేనూ కూడా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో హీరో అడవి శేషు సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తు..మన వైజాగ్ ప్రజలకు సినిమా నచ్చింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ రివ్యూ .. హనేస్ట్ మూమెంట్స్ అంటూ రాస్తూ మహేశ్ బాబుని కూడా ట్యాగ్ చేశాడు. మహేశ్ బాబు స్పందిస్తూ.. “నాకు నచ్చిన సినిమా మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ కామెంట్ చేశాడు. దీంతో మహేష్ బాబూ స్టార్ హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండ ఈ మేజర్ సినిమా ద్వార నిర్మాతగా కూడా సక్సెస్ కానున్నాడు.