Mahesh : ఎన్టీఆర్ షోలో తన సినిమాపై దిమ్మదిరిగే క్లారిటీ ఇచ్చిన మహేష్.!

Mahesh :నిన్న తెలుగు బుల్లితెర వీక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన బుల్లితెర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. అదే జెమినీ టీవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే గ్రాండ్ రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”.
అయితే దీనికి గాను సూపర్ మహేష్ బాబు హాజరు అవుతాడని ఎప్పుడు నుంచో తెలిసిందే. ఊరిస్తూ వస్తున్న ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఎట్టకేలకు నిన్న ప్రసారం అయ్యింది. అయితే ఈ షోలో ఇద్దరూ పండించిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. మరి ఇందులోనే ఎన్టీఆర్ మహేష్ బాబుని తాను చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా కోసం అడిగాడు. ఈ సినిమా ఎలా వస్తుంది అని అడగగా మహేష్ దిమ్మదిరిగే క్లారిటీ సమాధానం ఇచ్చాడు.
మళ్లీ చాలా రోజులు తర్వాత ఓ సినిమా తనకి హర్ట్ ఫుల్ గా చేస్తున్నానని, చాలా వెరియేషన్స్ స్క్రిప్ట్ తో చాలా నెలలు ట్రావెల్ అవ్వడం జరిగిందని చెప్పాడు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమిటంటే మళ్లీ ఖచ్చితంగా “పోకిరి” రోజులు ఫలితాన్ని తీసుకొస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈ సినిమాపై ఓ అదిరే క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. దీనితో ఈ భారీ సినిమా విజయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వచ్చే ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.