దుబాయ్ అందాల‌ను చూసి అనుభూతి చెందుతున్న మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్రత శిరోద్క‌ర్ అక్క శిల్ప శిరోద్క‌ర్ త‌న ఫ్యామిలీతో దుబాయ్‌లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. వెకేష‌న్స్ కోసం అప్పుడ‌ప్పుడు మహేష్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్ల‌నుండ‌గా, శిల్ప ఇంట్లోనే స్టే చేస్తారు. ఈ మ‌ధ్యే రెండు సార్లు దుబాయ్ చుట్టొచ్చారు. న‌మ్ర‌త వేడుకలు కూడా దుబాయ్‌లోనే జ‌రిపించారు. మ‌హేష్ సోద‌రి ఇంట్లోనే న‌మ్ర‌త బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ని న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఇక మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట కోసం చిత్ర బృందం దుబాయ్‌లోనే ఉండ‌గా, ఓ నెల రోజుల పాటు అక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాల‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఇటీవ‌ల మ‌హేష్‌, కీర్తి సురేష్‌పై ఓ సాంగ్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం. సాంగ్ షూట్ పూర్తి కాగానే, కీర్తి తిరిగి ఇండియాకు వ‌చ్చింది. ఇప్పుడు మ‌హేష్ తో పాటు కొన్ని స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌పైన షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే మ‌హేష్ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌ముఖ స్టార్ట‌ప్ కంపెనీ in5లో షూట్ కొన‌సాగుతుందనే విష‌యాన్ని తెలిపారు. ఐఎన్ 5దుబాయ్‌లో స‌ర్కారు వారి పాట షూటింగ్ చేస్తుండ‌డం గొప్ప అనుభవం. మాకు స్వాగ‌తం పలికిన కంపెనీ వారికి కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొన్నారు.

ఇక తాజాగా షార్జాకు సమీపంలో ఉన్న ఎడారి అందాలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. షార్జాకు ద‌గ్గ‌ర‌లో ఉన్న మ్లైహాలో స‌ర్కారు వారి పాట చిత్రీక‌రిస్తుండ‌డం మంచి అనుభూతిని క‌లిగిస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన క‌థ‌లు, లొకేష‌న్స్ చాలా బాగా న‌చ్చాయి. వారి ఆతిథ్యం, ప్రేమ గొప్ప‌గా ఉన్నాయంటూ మ‌హేష్ పేర్కొన్నారు . గ‌త ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్షకుల‌ని అల‌రించిన మ‌హేష్ బాబు ఇప్పుడు స‌ర్కారు వారి పాట చిత్రంతో ఫిదా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.