ఫారిన్ టూర్ కి బయలుదేరిన మహేష్ బాబు.. ఫొటోస్ వైరల్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రతి సినిమా తరువాత వెకేషన్ లకు వెళ్ళడం అలవాటు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి విజయం సాధించిన సందర్భంగా మహేష్ బాబు ఫారిన్ టూర్ కోసం బయలుదేరారు.

ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో కారు దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకా ఆ ఫోటోలో మహేష్ బాబు టీ షర్ట్ ట్రౌజర్, మాస్క్ అలాగే బ్లాక్ కలర్ క్యాప్ ధరించి కనిపించారు. అయితే ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు మాత్రమే కనిపించారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో. మహేష్ బాబు టూర్ కోసమే వెళ్ళారా లేకపోతే ఎక్కడికైనా వెళ్లారా అన్నది తెలియలేదు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా సర్కారు వారి పాట స్పెషల్ ఈవెంట్ లో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

తన సినిమాకు అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అలాగే సినిమా నిర్మాణ టీమ్ కి మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన పోస్టులు కూడా చేశారు. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే త్వరలోనే ఈ సినిమా కలెక్షన్స్ వంద కోట్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. సినిమా 2023 లో విడుదల కానుంది. SSMB28 టైటిల్ తో విడుదల కానున్న మరొక సినిమాలో కూడా మహేష్ బాబు నటించబోతున్నారు. అందులో హీరోయిన్ గా పూజా హెగ్డే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.