Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మహేష్ బాబు ఒకరు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాల నటుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ఒరిస్సాలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన ఒక సినిమా ఇప్పటికే 1500 సార్లు బుల్లితెరపై ప్రసారం కాగా ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాని ఆదరిస్తున్నారని తెలుస్తుంది.
ఇలా ఒక సినిమాని 1500 సార్లు టెలికాస్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులు చూస్తున్నారు అంటే ఆ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంత క్రేజ్ ఉన్న మహేష్ బాబు సినిమా ఏది అనే విషయానికి వస్తే.. ఆ చిత్రం మరేదో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అతడు.
మహేష్ బాబు త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా అందింది. కాగా ఈ చిత్రమే ‘స్టార్ మా’ లో ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు స్టార్ మా లో 1000 సార్లకు పైగా ఏ సినిమా కూడా ప్రసారం కాలేదు కానీ ఈ సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ చేసిన కూడా ప్రేక్షకులు ఆదరించటం విశేషం.తెలుగులో 2005లో వచ్చిన అన్ని చిత్రాల్లో కంటే ఈ చిత్రమే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా నిలిచింది. ఇక ఈ చిత్రం హిందీ బెంగాలీ లోను రీమేక్ అయింది.