Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తెగ ఆందోళనపడుతున్నారు. ఉన్నట్టుండి ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నిలిపివేయడంతో ఈ కంగారు మొదలైంది. ఇండస్ట్రీలో కరోనా కేసులు విజృంభిస్తున్నా కూడ మహేష్ షూటింగ్ ఆపలేదు. అన్ని జాగ్రత్తలతో పని కానిస్తూ వచ్చారు.

కానీ ఉన్నట్టుండి సెట్లో ఉన్న ఒకేసారి ముగ్గురు నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిత్రం బృందం షూటింగ్ నిలిపివేసింది. అది మొదలు కొత్త కొత్త పుకార్లు మొదలయ్యాయి. మహేష్ బాబుకు సాన్నిహిత్యంగా ఉండే మేకప్ మెన్ ఒకరికి కరోనా పాజిటివ్ అని అందుకే మహేష్ ఐసొలేషన్లోకి వెళ్ళిపోయారని కొందరు, మహేష్ బాబు కూడ ఎఫెక్ట్ అయ్యారేమో అని ఇంకొందరు అన్నారు. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేశారు మహేష్.
కుమార్తె సితారతో కలిసి సరదాగా గడుపుతున్న ఒక ఫోటోను ఇన్స్టాలో పెట్టారు. మహేష్ బాబే గనుక ఐసోలేషన్లో ఉండి ఉన్నా, ఆయనకే వైరస్ ఎఫెక్ట్ అయి ఉన్నా కుటుంబ సభ్యులతో కలవరు కదా. సో.. మహేష్ బాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి అభిమానులు కూడ కంగారు పడాల్సిన పనే లేదు.
