Mahesh Babu: పొష్ ఏరియాలో ఖరీదైన ఫ్లాట్ కొన్న మహేష్ బాబు.. అది ఎంతంటే?

Mahesh Babu: టాలీవుడ్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతన్ని ఎక్కువగా టాలీవుడ్ లో ఫ్యామిలీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే టాలీవుడ్ హీరోలలో ఫ్యామిలీకి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మహేష్ బాబుని పిలుస్తూ ఉంటారు. అలాంటి వరుసలో ఈ స్టార్ హీరో ముందు వరుసలో ఉంటాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 1న విడుదల కానుంది.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం మహేష్ బాబు బిజీ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు. ఇక సినిమాల నుంచి కాస్త విరామం దొరికిన సమయంలో ఆ సమయాన్ని తన ఫ్యామిలీ కోసం ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాడు. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబు తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుగు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ ప్లాటు ధర దాదాపు 26 కోట్లు అని తెలుస్తోంది. కుటుంబం మొత్తం నివసించాలి అంటే స్థలానికి ఆమాత్రం కొనుగోలు చేయాల్సిందే. మహేష్ బాబు కొన్న ఆ ప్లాటు దాదాపుగా 1442 చదరపు గజాల్లో విస్తరించి ఉందని సమాచారం. ఈ స్థలానికి నవంబర్ 17న ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టాంపు డ్యూటీగా 1.43 కోట్లు చెల్లించారు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పేరు బదిలీ కి గానూ 39 లక్షలు చెల్లించినట్లు వినికిడి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ప్లాట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా ఒక గజం ధర దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు పలుకుతోంది అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలుపుతున్నారు.