Mahesh Babu: బి.ఏ.రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహేష్ బాబు..?

Mahesh Babu: ప్రముఖ నిర్మాత సినీ పిఆర్ఓ అయిన బి.ఏ.రాజు ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. గుండె పోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇక స్టార్ హీరోల పిఆర్ వో గా బి.ఏ.రాజు చాలామందికి తెలుసు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బి.ఏ.రాజు గురించి చాలామందికి తెలిసింది. ఇక ఆయన చనిపోయిన తరువాత ఆయన గురించి చాలా మందికి తెలుసు. ఇతర స్టార్ హీరోలతో పోల్చుకుంటే బి ఏ రాజు ఘట్టమనేని కుటుంబానికి, అదే విధంగా హీరో మహేష్ బాబుకు చాలా దగ్గరి వాడు అని చెప్పవచ్చు.

మరి అలాంటి వ్యక్తి గురించి తాజాగా మహేష్ బాబు పలు వ్యాఖ్యలు చేశారు. అయితే బి.ఏ.రాజు పూర్తిపేరు ఏంటి అన్నది చాలామందికి తెలియదు. బి ఏ రాజు అనగా ఉత్తరాల రాజు అని అర్థం. ఇదే విషయాన్ని హీరో మహేష్ బాబు తెలిపారు. ఆహా లో స్త్రీమింగ్ అవుతున్న అన్ స్థాపబుల్ షోలో పాల్గొన్న మహేష్ బాబు బి ఏ రాజు గురించి మాట్లాడారు. అతనితో మహేష్ బాబు కు ఉన్న బంధం గురించి వివరించారు. బి ఏ రాజుకు తనకు మధ్య బాగా సాన్నిహిత్యం ఉందని, తన ప్లేస్ లో రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరని తెలిపారు.

సూపర్ స్టార్ కృష్ణకు బి.ఏ.రాజు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. అప్పట్లో కృష్ణ అతని అభిమానులకు లేఖలు రాసేవారు. ఆ లేఖలు రాయడానికి బి.ఏ.రాజు కృష్ణా దగ్గర ఉద్యోగంలో చేరారు. ఆ విధంగా మహేష్ బాబు రాజు కి చిన్నప్పటి నుండి తెలుసట. అలా అని ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తూ ఘట్టమనేని ఫ్యామిలీ లో కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. అంతే కాకుండా తన తండ్రి ఎక్కడికి వెళ్ళినా బి.ఏ.రాజు పక్కనే ఉండేవారు. అలాగే నేను ఎక్కడికి వెళ్లినా కూడా ఇదే జరిగేది అని మహేష్ బాబు తెలిపారు.