Mahanadu: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. అయితే ఈసారి ఊహించని విధంగా జగన్ కంచుకోట అయిన కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొనబోతున్నారు.
ఇలా మూడు రోజులపాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి రెండు రోజులు 2 లక్షల మందికి మూడో రోజున 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇలా ఈ మహానాడు కార్యక్రమంలో వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఏర్పాట్లు చేయడం విశేషం. దాదాపు 20 రకాల నోరూరించే పంటలను తయారు చేయించినట్టు తెలుస్తుంది.ప్రతిరోజూ భోజనాల్లో 20 వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారని సమాచారం అందుతోంది. ఈ వంటకాల తయారీ కోసం 1700 మంది వంటవాళ్లతో పాటు వడ్డింపు కోసం 800 మంది పని చేయనున్నారు.
తాపేశ్వరం కాజాతో పాటు ఒంగోలు అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగళి, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో 50వేల గుడ్లను కూడా వడ్డించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మహానాడు కోసం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా తన స్వహస్తాలతో తయారుచేసిన ఆవకాయని కూడా వడ్డించబోతున్నారు.
ఉదయం టిఫిన్ సెక్షన్ లో భాగంగా..టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమోటా బాత్ తో పాటు కాఫీ, టీ కూడా ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మధ్యాహ్న భోజనంలో గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటీ పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.శాఖాహారులకు గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమోటా పప్పు, తెల్లన్నం, రోటీ పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమోటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్ లో భాగంగా కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు ఇవ్వనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా రైస్ తో పాటు వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటీ పచ్చడి, పెరుగు ఇవ్వనున్నారు. ఇలా మహానాడు మేము చూస్తుంటే నోరూరిపోతుందని చెప్పాలి.