లైట్ తీసేసుకున్న దేవరకొండ ‘లైగర్’

Liger team return back to Hyderabad

Liger team return back to Hyderabad

విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ వ్యయంతో రూపొందుతున్న సినిమా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ఎక్కువ బాగా ముంబైలోనే షూటింగ్ చేయాలని ఆరంభంలోనే ప్లాన్ చేసుకున్నారు పూరి. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే లాక్ డౌన్ మూలంగా ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం మళ్ళీ ముంబైలోనే రీస్టార్ట్ చేశారు. కానీ ఈలోపే కరోనా ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్ విధించారు.

దీంతో పూరి బృందం ముంబైలోనే షూటింగ్ చేయాలనే ఆలోచనను విరమించుకుంది. అన్నీ సర్దుకుని హైదరాబాద్ తిరిగొచ్చేశారు. కాంప్రమైజ్ అయిన పూరి ఇక ముంబైను లైట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. మిగిలిన షూటింగ్ హైదరాబాద్లోనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో అనన్యాపాండే కథానాయిక. చార్మీ, కరణ్‌ జోహర్‌, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు 125 కోట్ల మొత్తాన్ని ఈ సినిమా మీద వెచ్చిస్తున్నారు.