KTRS: వాయిదా పడిన కేటీఆర్ ఖమ్మం పర్యటన.. కారణం బీజేపీనేనా!

KTRS: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలే ఖమ్మం పర్యటన చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. ఈ కామర్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టేక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయ ఉద్రిక్తత తీవ్రంగా ఉంది. దీంతో ఈ కారణంగానే కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడిందా అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరో రెండు రోజుల్లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.