Dulquer Salman: కరోనా బారిన పడిన స్టార్ హీరో.. హీరో తనయుడు!

Dulquer Salman: కరోనా మహమ్మారి మరొకసారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రోజు రోజుకి సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కరోనా బాధపడుతూనే ఉన్నారు. రోజు రోజుకి సినీ ఇండస్ట్రీ లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే మాలీవుడ్ స్టార్ హీరో అయిన మమ్ముట్టి ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మమ్ముట్టి ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే మరొకవైపు మమ్ముట్టి కుమారుడు అయినా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదిక తెలిపారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.. నాకు కొద్దిగా జలుబు మాత్రమే ఉంది. నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారు కూడా ఐసోలేషన్ లో ఉండండి.. అదేవిధంగా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి.

 

అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు తప్పకుండా ధరించండి.. సేఫ్ గా ఉండండి అంటూ ట్వీట్ చేసారు దుల్కర్ సల్మాన్. అయితే ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా వారం రోజుల గ్యాప్ లోనే కరోనా బారిన పడడంతో వారి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక వారిలో అభిమాన హీరో త్వరగా కోలుకోవాలి అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు కూడా చేస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్ ను చూసిన అతని అభిమానులు వీలైనంత త్వరగా తమ అభిమాన హీరో కోలుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.