Keerthy Suresh: ఆ విషయంలో మహేశ్ బాబు భార్యకి కృతజ్ఞత తెలిపిన కీర్తీ సురేశ్…!

Keerthy Suresh: నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ సినిమా హిట్ అవటంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. బాల నటిగా పలు సినిమాలలో నటించిన కీర్తి 2013లో గీతాంజలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించింది. తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. కీర్తి తెలుగులో నటించిన మహానటి సినిమాలోని ఆమె నటనకి గాను ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి.

ఇటీవల మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది. ఈ సినిమ హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా థియాటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాలో తన ,అందం అభినయంతో ప్రేక్షకులని మెప్పించింది. అలాగే తమిళంలో ఈమె నటించిన సాని కాయిదం అనే సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వటంతో ఈ అమ్మడు ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో సోషియల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

తాజాగా కీర్తి ట్విట్టర్ వేదికగా ఒక్ పోస్టు షేర్ చేసింది. ఈ క్రమంలో “నన్ను ఇంతలా ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా సాని కాయిదం, సర్కారు వారి పాట సినిమా యూనిట్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో నటిగా ఉండటం చాలా కష్టమైన విషయం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గత కొంతకాలంగా నేనేంటో నిరూపించుకుంటున్నా. ఈ రోజు ట్విట్టర్ వేదికగా నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా “సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సమయంలో అన్ని వేళలా నన్ను సపోర్ట్ చేసిన నమ్రత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మహేష్ బాబు గారితో నటించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వటానికి కృషి చేసిన సినిమా యూనిట్ మొత్తానికి నా కృతజ్ఞతలు”… అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.