Keerthy Suresh: టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇందులో యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, రవితేజ, విష్ణు, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ప్రభావతి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఫుల్ సెటైరికల్ కామెడీ ఓరియంటెడ్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా థియేటర్లకు బదులుగా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా ఎల్ నిర్మించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. హైదరాబాదులో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మీరు నటిస్తున్నారా? అని ప్రశ్నించగా.. దీనిపై స్పందించిన కీర్తి సురేశ్.. ఈ విషయాన్ని దిల్ రాజు సార్ చెబుతారంటూ నవ్వుతూ మాట్లాడింది.
అనంతరం ఉప్పు కప్పురంబు సినిమా గురించి కీర్తి సురేశ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. కుటుంబమంతా ఇంట్లో కూర్చోని హాయిగా ఈ సినిమా చూడవచ్చు. ఒక సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పాము అని తెలిపింది కీర్తి సురేష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.