మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఈ నెల 12వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్, డైరెక్టర్ పరుశురాం ముగ్గురు కలిసి కొత్తగా సోషల్ మీడియా సెలబ్రిటీస్, యూట్యూబర్స్ తో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వారు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం ఆశక్తికరమైన సమాధానాలను తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కీర్తి సురేష్ ను ప్రశ్నిస్తూ మీరు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు పర్స్ దొంగలించారు. నిజ జీవితంలో కూడా మీరు ఇలా పర్స్ దొంగతనం చేశారా? అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ కీర్తి ఎందుకు దొంగతనం చేస్తుంది అని చెప్పగా వెంటనే కీర్తి సురేష్ మహేష్ బాబు మాటలను ఖండిస్తూ తాను నిజ జీవితంలో కూడా పర్సు దొంగిలించానని సమాధానం చెప్పారు.ఈ విధంగా కీర్తి సురేష్ చెప్పిన సమాధానానికి మహేష్ బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
తాను చిన్నప్పుడు తన ఇంట్లో తన తండ్రి పర్స్ దొంగతనం చేశానని తెలిపారు. ఈ విధంగా తన నిజజీవితంలో జరిగిన ఈ సంఘటనను కీర్తి సురేష్ ఈ సందర్భంగా బయట పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇకపోతే కీర్తి సురేష్ తండ్రి సురేష్ ఒక దర్శకుడు, తల్లి మేనక మాజీ హీరోయిన్.ఈ విధంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన కీర్తి సురేష్ బాలనటిగా పలు సినిమాలలో నటించి అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
