చిరంజీవిని అవమానించిన జూనియర్ ఎన్టీఆర్.. దాని వెనుక గల అసలు నిజం ఇదే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియా వేదికగా చిరంజీవిని అవమానించినట్లు ప్రచారం జరింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీతో విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.

ఆ సినిమా విడుదలైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా చిరంజీవి ఎవరో నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు. నాకు తెలిసిన నటుడు మా తాత ఎన్టీఆర్ అని సమాధానం చెప్పారు. దీంతో నాగార్జున స్పందించి ఆ ఛానల్ కి ఫోన్ చేసి ఎన్టీఆర్ ని హెచ్చరించాడు అంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఈ వార్త సంచలనం కావడానికి గల కారణాల గురించి ఇటీవల ఒక వ్యక్తి వివరణ ఇచ్చాడు.

ఎన్టీఆర్ గురించి వచ్చిన ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ఇటీవల రుజువయ్యింది. ఇదంతా పాపులారిటీ కోసం ఒక వెబ్ సైట్ చేసిన తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. ఐతే ఆ వెబ్ సైట్ యజమాని చిరంజీవికి అత్యంగ సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. సదరు వ్యక్తి ఇటీవల ఈ విషయం గురించి వివరణ ఇస్తూ.. తన సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి సెన్సేషన్ కోసం ఈ వార్త క్రియేట్ చేశాడు. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఎన్టీఆర్ చిరంజీవి గురించి ఎలాంటి అవమానకర కామెంట్స్ చేయలేదని తెలియజేశారు.