Allu Arjun: అర్జున్ – హరీశ్ శంకర్ సెల్ఫీ వెనుక అసలు రహస్యం ఇదేనా….!

Allu Arjun: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ మరికొద్ది రోజుల్లో పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. అయితే ఇటీవల హరీష్ శంకర్‌, బన్నీని కలవడం, వారిద్దరూ కలిసి సెల్ఫీ కూడా దిగడంతో వారిద్దరి భేటీపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరిద్దరి కలయికలో ఇంతకు ముందు దువ్వాడ జగన్నాథం సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అది అప్పట్లో మంచి విజయం కూడా సాధించింది. ఆ తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురంలో, పుష్ప ది రైజ‌్ సినిమాలు చేశారు. వరుణ్ సందేశ్‌తో గద్దలకొండ గణేశ్ చేశారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా భవదీయుడు భగత్‌సింగ్‌కి రెడీ అవుతున్నాడు హరీశ్ శంకర్.

ఇకపోతే రీసెంట్‌గా ఆయన నిర్మాతగా ఏటీఎం వెబ్‌సైట్‌కు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజా బన్నీని కలవడంతో సినీ వర్గాల్లో పలు వార్తలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ సెల్ఫీతో ఆయన బన్నీకి కథ చెప్పేందుకు వెళ్లినట్టు ఫిలిం వర్గాలు అంటున్నాయి. అది పక్కన పెడితే హరీష్ శంకర్, అల్లు అర్జున్‌ని కలిసిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ అందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే, మనమిద్దరం ఎప్పుడు కలిసినా నవ్వులే నవ్వులు. అల్లు అర్జున్‌తో టైం సరదాగా గడిచింది. మళ్లీ కలిసే వరకు తగ్గేదెలే. ఎందుకు తగ్గాలి అని హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. హరీశ్‌కి పవన్‌ కల్యాణ్ సినిమా ఉంది. కాబట్టి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక వీరిద్దరి కలయికలో మూవీ మొదలవుతుందని సమాచారం.