మూడు కథలు క్యాన్సిల్ అయ్యి మహేష్ బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ ఏదో తెలుసా?

ప్రతి స్టార్ హీరోకు తన సినీ కెరీర్ లో సక్సెస్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. సక్సెస్ లో ఉన్న హీరోలకు మాత్రమే ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో పాటు సినిమాలలో వరుస ఆఫర్లు వస్తాయి. మహేష్ బాబు సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో పోకిరి ఒకటనే సంగతి తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్ 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా ఫుల్ రన్ లో ఈ సినిమా 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని స్థాయి విజయం దక్కింది. అయితే పోకిరి సినిమాతో సక్సెస్ సాధించిన మహేష్ బాబుకు తర్వాత సినిమాలతో వరుస షాకులు తగిలాయి. సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. టాలెంట్ ఉన్న దర్శకులకు మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చినా చాలామంది దర్శకులు ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోయారు.

శ్రీనువైట్ల మహేష్ బాబు కాంబోలో సినిమా ఫిక్స్ అయిన తర్వాత శ్రీను వైట్ల కథను సిద్ధం చేయడం కోసం ఎన్నో ఆలోచనలు చేశారు. మహేష్ పూర్తిస్థాయిలో ఫ్రీడమ్ ఇవ్వడంతో హిలేరియస్ ఎంటర్టైనర్ చేద్దామని శ్రీనువైట్ల భావించారు. ఆ తర్వాత గోపీ మోహన్ చెప్పిన లైన్ నచ్చి శ్రీనువైట్ల, మహేష్ కథ ఓకే చేశారు. అయితే శ్రీను వైట్ల మళ్లీ ఆ కథ డ్రాప్ అని చెప్పారు. ఆ సమయంలో శ్రీను వైట్ల మహేష్ ను ఎమ్మెల్యేగా చూపించాలని అనుకున్నారు.

ఒక్కరోజులో ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తైంది. సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఎన్నో టైటిల్స్ ను పరిశీలించి చివరకు దూకుడు టైటిల్ ను ఫైనల్ చేశారు. శ్రీను వైట్ల థమన్ కు ఛాన్స్ ఇవ్వగా థమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. మహేష్ సూచన మేరకు ఈ సినిమాలో శ్రీను వైట్ల మందు సీన్ ను పెట్టలేదు. శ్రీనువైట్ల మూడు కథలను క్యాన్సిల్ చేసి దూకుడు సినిమాను తెరకెక్కించగా దూకుడు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.