చిరంజీవిని కావాలని రోజంతా ఎండలో నిలబెట్టిన నిర్మాత ఎవరో తెలుసా?

స్టార్ హీరోలు కావడం సులభమైన విషయం కాదనే సంగతి తెలిసిందే. బ్యాగ్రౌండ్ లేని హీరోలంటే ఎవరికైనా చిన్నచూపు ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి ఎదగటానికి ఎదుర్కొన్న అవమానాలు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే సంగతి తెలిసిందే. అయితే కెరీర్ తొలినాళ్లలో చిరంజివీ తక్కువ పారితోషికానికే పని చేశారు.

చిరంజీవి నటించిన సినిమాలలో కోతల రాయుడు ఒకటి. సీనియర్ ఆర్టిస్ట్ తులసి ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ ను అంతలా అవమానించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కావడం గమనార్హం. షూటింగ్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నో నియమనిబంధనలను పాటించేవారు. ఆర్టిస్టుల వల్ల షూటింగ్ ఆలస్యమైతే ఆయన అస్సలు సహించేవారు కాదు.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు తులసి కూడా నటించారు. చిరంజీవి ఒకరోజు షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో ఆయన రోజంతా ఎండలో నిలబెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి సైతం నిర్మాత ఇచ్చిన పనిష్ మెంట్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి చిరంజీవి షూటింగ్ కు కరెక్ట్ టైమ్ కు హాజరై నిర్మాత నుంచి సమస్య రాకుండా జాగ్రత్త పడ్డారు. చిరంజీవి అలాంటి అవమానాలను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు.

ప్రస్తుతం వరుస రీమేక్ సినిమాలలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఈ ఏడాదే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది. హనుమాన్ జంక్షన్ తర్వాత మోహన్ రాజా డైరెక్షన్ లో తెలుగులో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి, మోహన్ రాజా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చుడాలి.