చిరంజీవి నంబర్1 హీరోగా ఉన్న సమయంలో విష ప్రయోగం.. ఎవరు చేశారంటే?

మెగాస్టార్ చిరంజీవి సీనియర్ స్టార్ హీరోలలో ఇప్పటికీ నంబర్ 1 స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రీఎంట్రీలో కూడా చిరంజీవి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. దాదాపుగా 25 సంవత్సరాల పాటు చిరంజీవి నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.

అయితే చిరంజీవి నంబర్1 హీరోగా ఉన్న సమయంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. 1988 సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి చిరంజీవికి తన పుట్టినరోజు అని చెప్పి కేక్ ఇచ్చాడు. అయితే నీ పుట్టినరోజున నేనే నీకు కేక్ తినిపిస్తానని చిరంజీవి చెప్పినా ఆ వ్యక్తి వినలేదు. ఆ తర్వాత కేక్ కిందపడగా అందులో ఏదో కెమికల్ ఉందని యూనిట్ సభ్యులు గుర్తించారు.

చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడం ఇష్టం లేక కొంతమంది చిరంజీవిని చంపటానికి ప్రయత్నించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవిపై నిజంగా విష ప్రయోగం జరిగిందో లేదో మాత్రం క్లారిటీ రాలేదు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి తాను చిరంజీవికి ఫ్యాన్ అని చిరంజీవిపై విషప్రయోగం చేయలేదని చెప్పారని సమాచారం. అయితే స్టార్ హీరోలు ఫ్యాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన ప్రూవ్ చేసింది.

చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ లలో నటిస్తున్నారు. ఈ రెండు రీమేక్ లతో చిరంజీవికి కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. మరో నాలుగైదు సంవత్సరాలు సినిమాలతో బిజీగా ఉండి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం. చిరంజీవికి వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.