ఇన్సైడ్ టాక్ : అప్పుడే మహేష్, త్రివిక్రమ్ ల సినిమా రిలీజ్ పై క్రేజీ అప్డేట్.!

తెలుగు సినిమా ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం నటించిన చిత్రాల్లో “సర్కారు వారి పాట” కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్లతో చేసిన ఈ సినిమా అనంతం మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తాను చేయనున్నాడు. 

అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా మహేష్ అయితే తన ఫ్యామిలీతో వెకేషన్ లో మహేష్ ఉన్నాడు. అయితే దీని తర్వాత మహేష్ జూలై నుంచి మహేష్ జాయిన్ అవ్వనున్నాడు. అయితే మరి ఇంకా అసలు షూటింగ్ కూడా స్టార్ట్ కాని ఈ చిత్రం రిలీజ్ డేట్ పై అప్పుడే క్రేజీ బజ్ మహేష్ దగ్గర వర్గాల నుంచే వినిపిస్తుంది. 

దీని ప్రకారం అయితే ఈ చిత్రం రిలీజ్ ని చిత్ర బృందం వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ చేసేయాలని చూస్తున్నారట. అంటే మేకర్స్ ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మన టాలీవుడ్ నుంచే ఓ స్టార్ హీరో ఇంకో కీలక పాత్రలో నటించనుండగా మరింత మంది స్టార్స్ నటిస్తున్నారు.