Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు చేస్తున్న దాడిలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు.  ఖార్కివ్ నగరంపై మంగళవారం ఉదయం రష్యా ప్రయోగించిన బాంబు దాడిలో భారతీయ విద్యార్థి  మరణించాడు. విద్యార్థి మృతికి సంబంధించిన  విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ భాగ్చి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ గంగ పేరుతో  కేంద్రం వెనక్కి తీసుకొస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇలాంటి  విషాదకర సంఘటన చోటుచేసుకోవడం అక్కడున్న భారతీయులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.