Crime News: నిర్మల్ జిల్లాలో దారుణం… గోదావరిలో మునిగి విద్యార్థి మృతి..!

Crime News: వేసవి కాలం వచ్చిందంటే ఎండ వేడిని తాళలేక చాలామంది ఈతకు వెళుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతూ ఈ క్రమంలోనే చాలామంది ఈత రాకపోయినప్పటికీ నీటి కుంటలు, బావి దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సరదాగా ఈత కోసం నీటిలో దిగి నీటిలో మునిగి మృత్యువాత పడిన ఘటన బంజారా హిల్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు అందరిని పాఠశాల యాజమాన్యం సరస్వతీ అమ్మవారి దర్శనం కొరకు బాసరకు తీసుకు వెళ్ళింది. ఈ క్రమంలో విద్యార్థులందరూ స్నానానికని పుష్కర ఘాట్ లో దిగారు.ఈ క్రమంలో విశాల్ అనే విద్యార్థి నీటిలో మునిగిపోవడం గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వెంటనే గజ ఈతగాళ్లు సహాయంతో బాలుడిని వెతికి బయటకి తీశాను. కానీ ఆప్పటికే విద్యార్థి మరణించాడు. దీంతో పాఠశాల యాజమాన్యం ఈ సమాచారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీసులకు అందజేసింది. చేతికొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.