Babu Mohan: ఎన్టీఆర్ చేతికి TDP పార్టీ పగ్గాలు ఇస్తే రూపురేఖలు మార్చేస్తాడు… బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

Babu Mohan: తాను ఏమున్నా గానీ మనసులో దాచుకోకుండా స్ట్రెయిట్ ఫ్రార్వార్డ్‌గా ఉంటానని, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే తాను ఊరుకోనని సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. ఎవడికి వాడు తప్పు చేసినా పర్వాలేదు గానీ, పేద ప్రజల సొమ్ముపై పడితే, పేద ప్రజల నోటి కాటి ముద్దను అడ్డుకుంటామంటే మాత్రం తాను అస్సలు ఊరుకోనని ఆయన తెలిపారు. ప్రజల సొమ్ము తింటే బాబు మోహన్ ఏం అంటాడని ఎవర్నైనా అడిగినా కూడా తోలు తీస్తానని చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి తానెప్పుడూ ప్రజల సొమ్మును ఆశించే వాళ్ల పట్ల తాను కఠినంగా ప్రవర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే రోజుకు లక్ష రూపాయలు తీసుకునేవాడిని, గంటల ప్రకారం డబ్బులు తీసుకునే తాను, అన్నెం, పుణ్యం తెలియకుండా ఫెయిర్ మైండ్‌తో తాను రాజకీయాల్లోకి వెళ్లానని ఆయన చెప్పారు. అలా వెళ్లినపుడు త్రికరణ శుద్ధిగా, ఆత్మ సాక్షిగా పని చేయడానికి వెళ్లినపుడు, ఆత్మ సాక్షిగానే పని చేశానని, చేస్తున్నానని కూడా ఆయన తెలిపారు. కాబట్టి తాను ఎవరికీ, ఏ ఆరోపణకీ భయపడనని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పట్లో టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు లేవని బాబు మోహన్ స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ ఎంటర్ అయిన రోజున మళ్లీ అవకాశం రావచ్చేమోనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు పైనుంచి ఎవ్వరినైతే ఆశీర్వదించి పంపిస్తారో, వారి వల్లే అది సాధ్యమవుతుందని, ఆ వ్యక్తి ఎవరూ అనేది చూడాలని ఆయన చెప్పారు. కానీ పూర్వ వైభవం రావడమనేది మాత్రం గ్యారంటీ అని మాత్రం తాను అనుకుంటున్నట్టు బాబు మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.