Hema: మోహన్ బాబు ఫోన్ చేసి అలా అనకపోతే గొడవ ఉండేది కాదు… నటి హేమ!

Hema: మా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారని తెలిసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడానని ప్రముఖ నటి హేమ అన్నారు. నిజం చెప్పాలంటే తాను ఈసారి పోటీలో నిలబడనని అనుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. అదే విషయం మోహన్ బాబు గారికి కూడా చెప్పినట్టు హేమ తెలిపారు. ఇకపోతే ప్రకాష్ రాజు గారు పోటీలో నిలబడుతున్నప్పుడు విష్ణు పోటీ చేస్తాడని ఎవరికీ తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. మెయిన్ ప్రాబ్లం అక్కడే వచ్చిందని ఆమె చెప్పారు.

ఒక రకంగా చెప్పాలంటే విష్ణు పోటీ చేస్తున్నట్టు చిరంజీవి గారికి కూడా తెలియదేమో అని హేమ అన్నారు. అందుకే ఆయన కూడా మనిద్దరం ఇంత క్లోజ్ కదా ముందే ఒక మాట అనుకొని ఉంటే ఇంత అయ్యుండేది కాదు కదా అని అన్నట్టు హేమ చెప్పారు.

ఇక వివరాల్లోకి వెళితే తాను విష్ణు గారి ప్యానెల్లో కాకుండా ప్రకాష్ రాజు గారి ప్యానెల్ నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఫోన్ చేసి తాను ఎలా అయితే చిన్నప్పుడు నా మనసులో కొన్ని సంఘటనలు అనుకున్నానో, ఏదైనా సాధించి ఊరికి రావాలని అనుకున్నానో అలాగే ప్రకాష్ రాజ్ కూడా జీవితంలో చాలా ఆటుపోట్లు చిన్నప్పట్నుంచి ఎదుర్కొన్నారని హేమ తెలిపారు. అదంతా కూడా ఆయన చెప్పే మాటల్లో, ఆయన ఎక్స్ప్రెషన్స్ లో కూడా అది కనిపించింది కూడా అని ఆమె వివరించారు. కాబట్టి ఆకలి బాధ తెలిసిన వారికి ఇంకొకరి ఆకలి బాధ తెలుస్తుందని హేమ చెప్పారు.

చిరంజీవి గారికి ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తక పోయినా రెండోసారి ఎత్తుతారేమో కానీ ప్రకాష్ రాజు గారు అయితే ఎప్పుడు చేసినా మాట్లాడతారని చెప్పారు. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, తనకు అదే నమ్మకం అని ఆమె అన్నారు. అదే విష్ణు విషయానికి వస్తే అందుబాటులో ఉంటాడా? నాకే దొరకకపోతే నా కింది వారికి ఎలా దొరుకుతాడు ? అనే అనుమానం తనకు కలిగినట్టు హేమ తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే ప్రకాష్ రాజు గారికి ఆకలి బాధ బాగా తెలుసు అని, అదే మోహన్ బాబు గారికి కూడా ఆకలి బాధ తెలుసు అని, అదే విష్ణు విషయానికొస్తే అది తెలియక పోవచ్చు అని ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ అని చెప్పొచ్చు అని హేమ అన్నారు. కాబట్టి ఏదో చేయాలన్న ప్రకాష్ రాజు గారి తపన చూసి ఆయన ప్యానెల్లో చేరానని తప్ప, ఇంకేం లేదని హేమ స్పష్టం చేశారు.