ఆ సినిమా చూసి బోరున ఏడ్చాను… మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయనకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఎంతోమంది అమ్మాయిలు మహేష్ బాబు అంటే పడి చచ్చేంత అభిమానం ఉంటుంది . ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లో 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సొంతం చేసుకుంది.

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఇటీవల పికాక్ అనే ప్రముఖ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మహేశ్ బాబు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా అని అడగ్గా..
హాలీవుడ్ మూవీ “లయన్ కింగ్” సినిమాను చూసి ఏడ్చినట్లు తెలియజేశాడు. అంతే కాకుండా తన తండ్రి నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాని చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ బ్యూటిఫుల్ అనే పదం ఎక్కువ వాడుతుంటా ఆని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు అతడు ఖలేజా వంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కూడా మంచి విజయం అందుకున్నాయి. మహేశ్ బాబు 11 సంవత్సరాల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు లేట్ చేయకుండా జూన్ నెల నుండి మొదలు పెట్టనున్నారు.