నీచుడు.. మూడు నెలలుగా మహిళా స్నానం చేస్తున్న వీడియోలు తీసి.. చివరికి?

రోజురోజుకు మహిళలపై జరిగే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మూడేళ్ల చిన్న పాపనుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఒకవైపు అత్యాచారాలు మరోవైపు మానసిక హింసలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు మహిళలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఆడవారు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నిత్యం ఏదో ఒక ప్రదేశాల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి లైంగిక దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఇలాంటీ సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది ఫిలింనగర్‌లోని ఒక ఇంట్లో ఉంటున్న మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా దిలిప్ అనే అబ్బాయి వీడియో తీస్తూ దొరికిపోయాడు. ఈ విధంగా యువకుడు మూడు నెలలుగా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నట్టు తెలిసింది. వీడియో తీసిన అబ్బాయి ఇంటి ఓనర్ కొడుకు.

ఇక ఎప్పటిలాగానే ఆ మహిళ స్నానం చేస్తుండగా ఆ యువకుడు రోజులాగే నేడు ఆమెకు తెలియకుండా వీడియో తీయడం ఆ మహిళ చూసి..వెంటనే ఆ ఇంటి ఓనర్‌కు చెప్పగా.. కాని ఓనర్ మాత్రం అతని కొడుకును వెనకేసుకుని వచ్చాడు.తన కొడుకు అలాంటి పనులు చేయడని,ఎలాంటీ నేరం చేయలేదని బుకాయించాడు. కాని ఆ మహిళ భర్త మాత్రం ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పాలని భావించి ఆ యువకుడు చేసిన ప్రసంగం అంతా పోలీసులకు వివరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు . విచారణ చేపట్టిన పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గత మూడు నెలలుగా ఆ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నట్టు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఒక టేబుల్ టెక్నీషియన్ గా చేస్తున్న ఒక యువకుడు బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళల వీడియోని తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం సంచలనంగా మారిన విషయం కూడా తెలిసిందే. ఇలాంటివి తరచుగా జరుగుతున్నా కూడా పోలీసులు సైతం అలాంటి వారిపై సీరియస్ గా స్పందించకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు.