లేటెస్ట్ : తారకరత్న ఆరోగ్యంపై కొత్త సమాచారం.!

నందమూరి హీరో అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు నందమూరి తారక రత్న ఇటీవల ఆకస్మిక గుండెపోటు కి లోనయ్యి ప్రాణాంతక పరిస్థితుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. టీడీపీ యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్ర స్టార్టింగ్ లో పాల్గొన్న తాను కుప్పం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయారు.

దీనితో స్థానిక హాస్పిటల్ కి చేర్చారు కానీ పరిస్థితి చేదాటుతుందని అంచనా వేయడంతో ఆ అర్ధ రాత్రి సమయంలోనే బెంగళూరు హార్ట్ స్పెషల్ హాస్పిటల్ కి అయితే తనని తీసుకెళ్లారు. అయితే అక్కడ కూడా పరిస్థితి అటు ఇటుగా ఉండడంతో వెంటనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా వెళ్లారు.

ఇక ఈ కొన్ని రోజులు అయితే తారకరత్న ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఇప్పుడు వారి కుటుంబం నుంచి లేటెస్ట్ సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తారకరత్నకు ఇంటెర్నేషనల్ వైద్య బృందం అయితే చికిత్స అందిస్తుందట.

అయితే తారక రత్న ఇప్పుడు హార్ట్ తో పాటుగా తన నాడీ సంస్థకి సంబంధించి కూడా పోరాడుతున్నారట. దీనితో ఈ రెండిటిని వారు మానిటర్ చేస్తూ చికిత్స అందిస్తున్నారని కొత్త సమాచారం. ఇలా ప్రస్తుతానికి స్టేబుల్ గా చికిత్స కొనసాగుతుంది. మరి మళ్ళీ తాను ఎప్పుడు కోలుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.