హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడలో ఈ పెలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తున్న బాంబు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ పేలుడు దాటి సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు . ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు పేలుడుకు గల కారణాలను తెలుసుకోడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.