Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇలా ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీలు వారి వారసులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఘటంనేని కుటుంబం నుంచి ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా ఘట్టమనేని వారసులు ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎక్కడ అధికారకంగా తెలియజేయలేదు కానీ ప్రస్తుతం మాత్రం ఘట్టమనేని వారసుడు ఎంట్రీకి సర్వం సిద్ధమైందని తెలుస్తుంది అయితే మహేష్ వారసుడు అంటే గౌతమ్ కాదండోయ్.. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న రమేష్ బాబు కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
ఇక రమేష్ బాబుకు జయకృష్ణ భారతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే జయకృష్ణ తన చదువులన్నింటిని పూర్తిచేసుకుని అమెరికాలో నటన పరంగా శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన సినీ ఎంట్రీ కి సర్వం సిద్ధమైంది ఇప్పటికే డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ అన్ని సిద్ధమయ్యాయి అని తెలుస్తుంది ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఘట్టమనేని వారసుడు జయ కృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ, యాక్షన్ జోనర్లో రాబోతుందని తెలుస్తోంది అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు సమాచారం అయితే ఈ సినిమా వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మహేష్ బాబు చూసుకుంటున్నారు. ఇక జయకృష్ణ లుక్ కూడా మహేష్ బాబులానే కనిపిస్తారు. ఇక జయకృష్ణ ఎంట్రీ అనంతరం గౌతమ్ ఘట్టమనేని సినీ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.