సోషల్ మీడియాని రూల్ చేస్తున్న నలుగురి యంగ్ బ్యూటీల సింగిల్ సెల్ఫీ.!

మారుతున్న కాలంతో సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్ ఎప్పటికప్పుడు పరిచయం అవుతూనే ఉంటుంది. అయితే హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ విషయంలో మాత్రం ఎప్పుడు ఒకింత ఆసక్తి ఉంటుంది. కొంతమంది సెటిల్డ్ హీరోయిన్స్ చాలా హుందాగా ఉంటారు. అలాంటి వారు స్టడీగా సక్సెస్ అందుకుని నిలదొక్కుకోవడం అనేది అరుదుగా ఉంటుంది.

అలా ఇప్పుడు లేటెస్ట్ గా మన తెలుగు మరియు తమిళ భాషల్లో కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు. అలా ఆ కొద్ది మంది హీరోయిన్ లు తీసుకున్న సింగిల్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. నాచురల్ బ్యూటీ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి..

అలాగే లేటెస్ట్ హిట్ సినిమా డాన్ హీరోయిన్ గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ అలాగే మరో యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియ దర్శన్ లు తీసుకున్న ఒక సెల్ఫీ చూడ్డానికి మంచి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తూ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది. దీనితో ఈ నలుగురు హీరోయిన్ లు ఈ ఫోటో చూసిన వారి ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.