బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో నలుగురి అరెస్టు

బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసులు నమోదు చేశారు. వారిలో డీజే ఆపరేటర్‌ వంశీధర్‌రావు, పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ ముప్పల, ఈవెంట్‌ మేనేజర్‌ అనిల్‌, వీఐపీల చూసే కునాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చాక్లెట్‌ రోల్స్‌లో ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ పెట్టి డగ్స్ పంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో డ్రగ్స్‌ పట్టుబడటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్రను సీపీ ఆనంద్ సస్పెండ్‌ చేశారు.