ఉన్నపళంగా ‘పుష్ప’ సెట్స్ నుండి వెళ్ళిపోయిన విలన్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. కరోనా సెకండ్ వేవ్ వేళ అన్ని సినిమాలు ఆగిపోయినా ‘పుష్ప’ను మాత్రం కొనసాగించారు. రిలీజ్ డేట్ మిస్ కాకూడదని సుకుమార్ పట్టుబట్టి మరీ షూటింగ్ చేస్తూ వచ్చారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేసినా బృందం మాత్రం కరోనా ధాటి నుండి తప్పించుకోలేకపోయింది. ఏకంగా అల్లు అర్జున్ వైరస్ బారిన పడ్డారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆయనకే కాదు సిటీలోని ఇంకో నలుగురికి వైరస్ సోకింది. దాంతో చిత్రీకరణకు బ్రేకులు పడ్డట్టే అనుకున్నారు.

కానీ సుకుమార్ మాత్రం ప్రతినాయకుడి పాత్ర చేస్తున్న ఫహాద్ ఫాజిల్ మీద షూటింగ్ జరపాలి అనుకున్నారు. ఇప్పుడు ఆయన డేట్స్ మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. బన్నీ తిరిగొచ్చేలోపు ఫహాద్ పోర్షన్ కొంతైన కంప్లీట్ చేయలని ప్లాన్ చేసుకున్నారు.

రెండు మూడు రోజులు షూటింగ్ జరిపారు కూడ. కానీ పరిస్థితిని గమనించిన ఫహాద్ కేసుకు ఎక్కువవుతున్నాయని గ్రహించి జాగ్రత్తపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో షూటింగ్ చేయడం మంచిది కాదని భావించి ఇంటికి వెళ్ళిపోయారట. దీంతో చేసేది లేక సుకుమార్ ప్యాకప్ చెప్పాల్సి వచ్చిందట. అలా కాకుండా ఫహాద్ గనుక సహకరించి ఉంటే సుకుమార్ ఇంకొన్నిరోజులు షూటింగ్ జరిపేవారేమో.